

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 21
రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి జగన్ మోహన్ రాజు ఘన స్వాగతం ప్రకటించినందుకు ఆనందంతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాధవరం 1 లోని పలువురు టిడిపి నాయకులు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి రాజంపేట ప్రజల సుదీర్ఘ నిరీక్షణ ఫలింపజేసినందుకు ఇన్చార్జిగా జగన్మోహన్ రాజును ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్ మోహన్ రాజు నాయకత్వంలో రాజంపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలని తద్వారా పార్టీ ప్రయోజనాలు పొంది నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చమర్తి జగన్మోహన్ రాజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ వీరభద్రుడు హరిప్రసాద్ వెంకటరత్నం మురళి రాజారాం ఓబులేసు రామకృష్ణ భాష మా భాష సుబ్బరాయుడు నరసింహ కమల్ బీ రహమతుంబి మౌలాలి సిలార్ సాబ్ చిన్న తదితరులు హాజరయ్యారు.