పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పొన్నూరు పట్టణ, మండల పరిధిలోని అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వారికి సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.