

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 29:
సర్వజన ఆమోదయో గ్యంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేముల సలీం భాషా కవితలల్లారని వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్య క్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. తెలుగు భాష దినో త్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్ కే ఆర్ & ఎస్ కే ఆర్ ప్రభుత్వం మహిళ డిగ్రీ కళాశాలలో ఆ కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేమల సలీ మ్ భాష కవిత్వీకరించిన ‘సమీ చీనం’ కవితా సంపుటి పుస్తక పరి చయ సభను నిర్వహించారు. మొ దట గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వ్యవహారిక భాషోద్యమానికి మూల కారకుడైన ఆయన చేసిన కృషిని కొనియాడారు.