

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 17:
కడప జిల్లాకళాకారుడు మందల విజయ కుమార్ జ్ఞాప కార్థం నేడు గురు వారం రాత్రి 8:30 గంటలకు సాయి పేట లో కడప రాజీవ్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో కొన్ని కళా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందని ఆ క్లబ్ చైర్మన్ మంద ల మురళి కృష్ణ అన్నా రు.బుధవారం ఒన్ టౌన్ దగ్గర ఉన్న రాజీవ్ కల్చరల్ క్లబ్ లో ఆయన విలేకరుల తో మాట్లా డారు.ప్రదర్శనల్లో బాగంగా ముందుగా శ్రీకృష్ణ రాయబారం నాటకం లోని “పడక సీను”చింతా మణి నాటకం లోని ‘ఉంగరాల సీను, భవానీ సీను ,”సత్య హరిశ్చంద్ర” పూర్తి నాటకం ప్రదర్శిం ప బడుతుందని చెప్పారు ఇందులో అనుభవం గల గొప్ప కళాకారులు పాల్గొంటారని చెప్పారు.కావున కళాకారు లు,కళాభిమానులు, తిలకించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాటకాల గురువు ఎడవల్లి రామలింగం, ప్రదర్శనలు చేసే కళాకారులు, దాసరి సుధా కర్,వి ప్రకాశం, ఎం వెంకట సుబ్బ య్య, ప్రకాశం శర్మ బాల చెన్నయ్య, నర్సింహ్ములు, తదితరులు పాల్గొన్నారు