
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 23
సాలాబాద్ గ్రామంలో మంగళవారం 23న ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారులు డాక్టర్ సి.భావన,డాక్టర్ పి.అరుణజ్యోతి,గ్రామ సర్పంచ్ M.స్వర్ణలత ఆధ్వర్యములో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ముందుగా సర్పంచ్ రిబ్బన్ కత్తరించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.ఇందులో చిన్నపిల్లలకు వాక్సినేషన్,గర్భిణీ పరీక్షలు,పంటి,కంటి పరీక్షలు,కాన్సర్ పరీక్షలు,సికిల్ సెల్,బీపీ,షుగర్ పరీక్షలు చేయడం జరిగినది.గర్భిణీ స్త్రీలకు సర్పంచ్ చేతులమీదుగా పోషకాహార కిట్ ఇప్పించడం జరిగినది.పోషకాహారం వలన కలుగు లాభాలగురించి అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలకు వివరించడం జరిగినది.ఈ కార్యక్రమం లొ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ,సి హెచ్ ఓ శిరీష, స్త్రీ ఆరోగ్య కార్యకర్తలు కరీమున్నిస,ఉమాదేవి అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.