రాజానగరం మండలం, జి. యర్రంపాలెం గ్రామంలో రైతు సేవా కేంద్రం ప్రారంభించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు..
ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు సులభతరం చేయడంతో పాటు, రైతులకు తగిన ధర మరియు సమయానికి చెల్లింపులు అందేలా చూసేందుకు రైతు సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. రైతుల అభివృద్దే దేశ అభ్యుదయమని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.