Home వార్తలు తెలంగాణ నుంచి సివిల్స్‌ ఇంటర్వ్యూకు 43 మంది – VRM MEDIA

తెలంగాణ నుంచి సివిల్స్‌ ఇంటర్వ్యూకు 43 మంది – VRM MEDIA

by VRM Media
0 comments
తెలంగాణ నుంచి సివిల్స్‌ ఇంటర్వ్యూకు 43 మంది


న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు హవా కొనసాగించారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన మెయిన్స్‌లో మొత్తంగా 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ రౌండ్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు మెయిన్స్ రాత పరీక్షలలో క్వాలిఫై అయిన విద్యార్థుల రోల్ నంబర్లు, పేర్లతో జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో 43 మంది తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వంమంది అభ్యర్థులు ఉన్నారు. గత ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 140 మంది అభ్యర్థులు రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందారు.. 20 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 202 మందికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించగా.. వారిలో 43 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. ఈ 43 మంది అభ్యర్థులకు త్వరలోనే మరో రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించనుంది.

రాజన్న ఆలయం మూసివేత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,820 Views

You may also like

Leave a Comment