


VRM మీడియా న్యూస్
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి నియోజకవర్గం
ఖమ్మం జిల్లా
కల్లూరు – 24-11-2025 (సోమవారం)
కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మట్టా దయానంద్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ చీరను ధరించి కార్యక్రమానికి హాజరైన MLA రాగమయి దయానంద్ గారు —
“మహిళల కోసం తీసుకువచ్చిన ఈ చీరల క్వాలిటీ అద్భుతం” అని అన్నారు.
కార్యక్రమం అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలపై పాలాభిషేకం చేశారు మరియు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
AMC చైర్మన్ లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…