Home వార్తలు మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డిని కట్టడి చేస్తున్న బీఆర్ఎస్.. నియోజకవర్గంపై ఆయన నీడపడకుండా.. – VRM MEDIA

మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డిని కట్టడి చేస్తున్న బీఆర్ఎస్.. నియోజకవర్గంపై ఆయన నీడపడకుండా.. – VRM MEDIA

by VRM Media
0 comments
మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డిని కట్టడి చేస్తున్న బీఆర్ఎస్.. నియోజకవర్గంపై ఆయన నీడపడకుండా..


||బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తీగల కృష్ణారెడ్డి||

,(రంగారెడ్డి ఈవార్తలు, అక్కినేపల్లి పురుషోత్తంరావు)

మహేశ్వరం టిక్కెట్టు తనకే అందించిన సవిత ఇంద్రారెడ్డికి పార్టీ ఓడిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి దూకుడుకు భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆయన కాళ్లకు బంధం వేసినట్టు తెలిసింది. ‘ఇబ్రహీంపట్నం అనే బంధాన్ని’ ఆయన కాళ్లకు వేసినట్టు అవగతం అవుతోంది. తీగల కృష్ణారెడ్డి వల్ల తన ప్రచారానికి ఇబ్బంది తప్పదని భావించిన సెట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలు ముగిసేంత వరకు మహేశ్వరంలో ఆయన నీడ పడకుండా చూడాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిసింది. దీనితో అధిష్టానం ఆయనను బుజ్జగించినట్లు సమాచారం. చివరకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

అంతేకాకుండా, ఎన్నికల్లో ఆయన సేవలను వినియోగించుకునేందుకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జిగా కృష్ణారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త బాధ్యత లేకుండా ఆయన మహేశ్వరం నియోజకవర్గంలో తిరిగే అవకాశం పోయింది. 2018 ఎన్నికల్లో తనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తనను సంప్రదించకుండానే పార్టీలో చేర్చుకున్నారని, ఏకంగా మంత్రి పదవిని సైతం కట్టబెట్టారని తీగల కృష్ణారెడ్డి ముందు నుంచీ అసంతృప్తిగానే ఉన్నారు. తన ఓటమికి కారణమైన సబితకు పార్టీలో పెద్దపీట వేయడం ఆయనకు మింగుడు పడలేదు. సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉంటూ తరచూ పలు ఘాటైన ఆరోపణలతో నిలుస్తున్నారు.

ఓ దశలో తీగల కృష్ణారెడ్డి భారత రాష్ట్ర సమితి పార్టీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ ఆయన పార్టీని మాత్రం వీడలేదు. ఈ ఎన్నికలలో ఆయన కీలకంగా మారుతారని భావించారు. కానీ నియోజకవర్గంలో ఆయన నీడ పడకుండా కట్టడి చేసిన పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది.

హద్దు దాటను: రాశీఖన్నా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,813 Views

You may also like

Leave a Comment