[ad_1]
1971 నాటి చరిత్రాత్మక ‘ఆపరేషన్ ట్రైడెంట్’ విజయగాథను స్మరించుకుంటూ, సముద్ర తీరాల రక్షణలో నావికాదళం చేస్తున్న అవిశ్రాంత సేవను గుర్తుచేసుకునే రోజు.. డిసెంబర్ 4. భారత జాతీయ నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఇది. ఈ వేడుకల సందర్భంగా గతాన్ని నెమరువేసుకోవడంతో పాటు, భవిష్యత్తును తీర్చుకునేందుకు సన్నద్ధతపై విస్తృత చర్చ జరగాలి. ముఖ్యంగా, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఐఐఐ) శకం తలుపుతడుతున్న ఈ తరుణంలో, నావికాదళ వ్యవస్థ తన శిక్షణను ఎలా మార్చుకోవాలనేది నేటి ప్రధాన ప్రశ్న. భారత నావికాదళం దశాబ్దాలుగా ఎన్నో కీలక విజయాలను నమోదు చేసింది. కేవలం యుద్ధ సమయాల్లోనే కాక, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి నెలకొల్పడంలోనూ, ‘సాగర్’ విజన్ ద్వారా ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనూ ముందంజలో ఉంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ‘ఫస్ట్ రెస్పాండర్’గా వ్యవహరిస్తూ తన సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రవేశంతో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని నౌకాదళం సాధించి చూపింది. అయినప్పటికీ, చైనా నావికాదళం విస్తరణ, హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్రపు దొంగల బెడద ప్రస్తుత ప్రస్తుత సవాళ్లు. వీటిని ఎదుర్కోవాలంటే సాంప్రదాయ పహారా పద్ధతులు సరిపోవు. భవిష్యత్తు యుద్ధాలు సాంకేతికంగా అత్యంత ఆధునాతనంగా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో, నావికాదళం నీటి సౌకర్యం, గాలిలో, అడుగున నడిచే మానవరహిత వాహక నౌకలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తేవాలి. ఇది సిబ్బందికి ప్రమాదాన్ని తగ్గిస్తూ, నిఘా పెంచుతుంది. నౌకలు, కమాండ్ సెంటర్ల మధ్య జరిగే సమాచార మార్పిడిని సైబర్ దాడుల నుంచి రక్షించడం ముఖ్యం. ‘క్వాడ్’ వంటి అంతర్జాతీయ కూటములతో మరింత సమన్వయంతో వ్యవహరిస్తూ, సముద్ర భద్రతా చర్యలను పంచుకోవాలి. కృత్రిమ మేధస్సు రాకతో రక్షణ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి. భారత నావికాదళం ఈ మార్పును తక్షణమే అందిపుచ్చుకోవాలి. ఉపగ్రహాలు, డ్రోన్లు, సోనార్ల వచ్చే అపారమైన డేటాను పరిశీలించడానికి ఏఐ అల్గారిథమ్లను ఉపయోగించాలి. ఇది శత్రు కదలికలను త్వరగా గుర్తించడానికి, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్తి ఆయుధ వ్యవస్థలపై పరిశోధనలు ముమ్మరం చేయాలి. ఇవి లక్ష్యాలను మరింత కచ్చితత్వంతో ఛేదిస్తాయి. నావికులలో వర్చువల్ రియాలిటీ, ఏఐ సిమ్యులేటర్లను ప్రవేశపెట్టడం ద్వారా, క్లిష్టమైన పరిస్థితులను తగిన విధంగా శిక్షణ పొందేలా వారిని సన్నద్ధం చేయాలి. భవిష్యత్తు సవాళ్లకు అనుగుణంగా సాంకేతిక ఆయుధాలను ధరించాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. నావికాదళాన్ని ఏఐ-ఆధారిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తిగా మార్చడం ద్వారా, ‘బ్లూ వాటర్స్’లో భారతదేశ ఆధిపత్యాన్ని మనం కొనసాగించండి. జై హింద్.
– పార్థసారథి, లెఫ్ట్నెంట్ (రిటైర్డ్)
Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 3 డిసెంబర్ 2025
పిన్కోడ్కు గుడ్బై చెప్పండి.. భారత్లో కొత్తగా డిజి పిన్
[ad_2]