Home Uncategorized ఒంటిమిట్ట లోని కోన రాజు పల్లి లో బయటపడ్డ పురాతన విగ్రహాలు

ఒంటిమిట్ట లోని కోన రాజు పల్లి లో బయటపడ్డ పురాతన విగ్రహాలు

by VRM Media
0 comments

VRm న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట జనవరి 3

ఒంటిమిట్ట మండలంలోని కోనరాజుపల్లి హరిజనవాడ సమీపంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే హరిజనవాడలోని బాలిపోగు హరికృష్ణ అనే బాలుడు 2 నెలల నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కలలో కనిపించి నన్ను బయటకి తీయమని తనకు చెబుతున్నాడని హరికృష్ణ తండ్రి కదిరయ్య చెప్పాడు. ఆ కలలో ప్రకారం శనివారం హరిజనవాడకు సమీపంలో హరికృష్ణ చూపిన చోట తవ్వి చూడగా, పురాతన లక్ష్మీనరసింహస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఇది చూడటానికి సమీప గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.

2,822 Views

You may also like

Leave a Comment