ఒంటిమిట్టలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి తహశీల్దార్ దామోదర్ రెడ్డికి వినతులు వెల్లువత్తాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. ఈరోజు భూ సమస్యలపై 8 వినతి పత్రాలు అందాయని, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని తహశీల్దార్ దామోదర్ రెడ్డి తెలిపారు.