vrm media ప్రతినిధి ఖమ్మం

ఖమ్మం నగరంలోని స్థంభాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల భాస్కర్ రావును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీలు పరామర్శించారు.భాస్కర్ రావు అనారోగ్యాన్ని గురైనట్లు తెలిసి రవిచంద్ర, గాంధీలు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.అలాగే, అక్కడే చికిత్స పొందుతున్న చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన హరిప్రసాద్ ను కూడా రవిచంద్ర,గాంధీలు పరామర్శించారు.