
తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపడానికి ఈగల్ టీం శతవిధాల కృషి చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ ను కట్టడి చేయడంలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోర్స్ ఈగల్ గత కొన్ని రోజులుగా డ్రగ్స్ పార్టీలపై వరుస దాడులు చేస్తోంది.
తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు
ఇటీవలే కొండాపూర్లోని ఓ పబ్పై దాడి చేసిన ఈగల్ టీమ్, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన కొందరు వ్యక్తులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం మరో రిసార్ట్ పైన ఈగల్ టీం దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని చరిత్ర తారామతి రిసార్ట్లో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది.

డ్రగ్స్ తనిఖీలను నిర్వహించిన ఈగల్ టీం అధికారులు
తారామతి రిసార్ట్లో ఏర్పాటుచేసిన జాక్ అండ్ జాన్సన్ అనే హై ప్రొఫైల్ ఈవెంట్లో భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఈగల్ టీం పక్క సమాచారంతో రంగంలోకి దిగింది. బాలీవుడ్ కి చెందిన పలువురు నటులు కూడా ఆ పార్టీలో పాల్గొన్న ఈగల్ టీం అధికారులు డ్రగ్స్ తనిఖీలు చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ఫోర్స్
రిసార్ట్ వచ్చిన తమ స్వాధీనంలోకి తీసుకొని అనుమానం వారితో పాటు అక్కడికి వచ్చిన చాలామందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలను చేశారు. అయితే అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ కోసం ఈగల్ టీం, హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అధికారుల సహకారం తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఇటీవల ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేసింది.
డ్రగ్స్ పార్టీలు, రేవంత్ పార్టీలపై నిఘా
ఈ నగరంలోనే హైదరాబాద్తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న పబ్ లు, ఫామ్ హౌస్ లు, రిసార్ట్ ల పైన ఈగల్ టీం దాడులు జరుగుతున్నాయి. డ్రగ్స్ పార్టీలు, రేవంత్ పార్టీలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయడంతోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు.
డ్రగ్స్ వస్తువులలో బాలీవుడ్ సెలబ్రిటీలు
ఈ మేరకు తాజాగా తారామతి రిసార్ట్లో నిర్వహించిన డ్రగ్స్లో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు గుర్తించి, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిలో డ్రగ్స్లో ఎంతమంది పాజిటివ్మంది ఉన్నారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.