
తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
గాయకురాలు మంగ్లీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్లు మోసం చేసినట్లు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కేసు వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగిందనేది ఆసక్తిగా మారుతోంది.
సినీ గాయకురాలు మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రూ 10 కోట్లు మోసం చేసారని మంగ్లీ తో పాటుగా ఆమె సోదరుడి పైన ఫిర్యాదులు వచ్చాయి. ఆమెతోపాటు తన సోదరుడు శివపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగ్లీ తనను మోసం చేసిందని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితోపాటు మరో ముగ్గురిపై బీఎన్ఎస్ సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో వరుస పాటలతో పాపులారిటీ సొంతం చేసుకుంది. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్లు సమాచారం.

మంగ్లీ పైన ఆరోపణలు.. ఫిర్యాదు
వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదు దారుడు చెబుతున్నారు. ఎంత కాలం వేచి చూసినా.. లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు తిరిగి ఇవ్వలేదని బాధితుడు. తనకు ఫోన్ చేసి మంగ్లీ, ఆమె సోదరుడు శివ బెదిరింపులకు ప్రేరేపించినట్టు పంజాగుట్ట పిఎస్ లో న్యాయవాది ఫిర్యాదు చేసారు. తనను యాక్సిడెంట్ చేసి చంపుతానని మంగ్లీ , ఆమె సోదరుడు బెదిరించినట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తున్నది. వీరితో తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏ5గా మంగ్లీ, మిగిలిన నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఇప్పుడు ఈ కేసు విషయంలో మంగ్లీ ఏం స్పష్టత ఇవ్వనున్నారనేది కీలకంగా మారుతోంది.