
టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అరుదైన మైలురాయి, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో కూడా సరికొత్త ప్రయోగాలతో నేటి తరం సరిహద్దులను బ్రేక్ చేస్తున్న ఈ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘సింగ్ గీతం’. ‘ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ ఫాంటసీ’గా అత్యంత భారీ అంచనాలతో జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ సడన్గా వాయిదా పడింది. ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న సినీ అభిమానులకు ఈ వార్త తీవ్ర నిరాశను మిగిల్చింది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం పాటలు, సంగీతమే ప్రధానంగా.. ఎలాంటి మాటలు లేకుండా ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో సింగీతం శ్రీనివాసరావు ఈ వయసులో చేసిన ప్రయోగం చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఇటీవలే సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘U’ సర్టిఫికెట్ కూడా సాధించిన ఈ చిత్రం, ఆఖరి నిమిషంలో థియేకల్ విడుదలను వాయిదా వేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నిజానికి గత కొద్దిరోజులుగా చిత్రబృందం ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్లో నిర్వహించింది. చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ విచ్చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, రీసెంట్గా విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిన్నపాటి సాంకేతిక కారణాలు లేదా గ్రాఫిక్స్ పనుల్లో మరింత క్వాలిటీ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.
సింగీతం శ్రీనివాసరావు గతంలో ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’ వంటి కల్ట్ క్లాసిక్స్ అందించి ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టి రూపొందించిన ఈ ‘సింగ్ గీతం’లో ప్రతాప్ అనే యువకుడి చుట్టూ తిరిగే కథను చాలా విజువల్ వండర్గా చూపించబోతున్నారు. సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే నిర్మాతలు జూన్ 11 విడుదల తేదీని వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. ఒకరోజు ఆలస్యంగా అంటే జూన్ 12న ఈ రోజు విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం.