
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వివాదం రాజుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా రాజకీయాలు, సినీ రంగానికి సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగే మాటల యుద్ధాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే మారుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక పెద్ద వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను తీవ్రంగా ఊపేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలకు, బండ్ల గణేష్ అంతే ఘాటుగా సమాధానమిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య జరిగిన ఈ తీవ్రమైన చర్చ ఇండస్ట్రీలోనూ, సాధారణ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఒక వివాదం కేసులో యూట్యూబర్ ‘రావణ్’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్ట్, కోర్టు బెయిల్ నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ”ఏంటీ నాటకం, దౌర్జన్యం? ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, కోర్టు బెయిల్ ఇస్తుంది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు, మళ్లీ కోర్టు బెయిల్ ఇస్తుంది. ఇలా వరుసగా అరెస్ట్ చేయడం, కోర్టులు బెయిల్ చూస్తుంటే కోర్టు ఏం చెబుతోందో మీకు అర్థం కావడం లేదా? మీరు పెడుతున్నవి తప్పుడు కేసులు, అరెస్ట్ చేయొద్దని కోర్టులు చెబుతున్నా వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం ఇందుకేనా అధికారంలోకి వచ్చింది? ఏంటి కక్ష సాధింపు? ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? దేశం మొత్తం ఈ పరిణామాలను చూస్తోంది. మీరు ముమ్మాటికీ తప్పు. మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు మద్దతుగా నిలబడతాం” అంటూ ఏపీ ప్రభుత్వంపై అత్యంత తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ప్రకాష్ రాజ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యల వీడియోపై నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్ ప్రవర్తనను పూర్తిగా తప్పుబడుతూ ఆయనపై తీవ్ర స్థాయిలో ఉంది. ”నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి.. జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది. కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది” అంటూ బండ్ల గణేష్ అత్యంత కఠినమైన పదాలతో హితవు పలికారు.
బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. చాలా మంది నెటిజన్లు బండ్ల గణేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో సమాజంలో ఎన్నో పెద్ద సంఘటనలు, ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేవని ప్రకాష్ రాజ్ నోరు, ఇప్పుడు కేవలం ఈ ‘రావణ్’ అనే వివాదం విషయంలో మాత్రమే ఎందుకు లేస్తుంది? అంటూ ప్రజలు కూడా ప్రకాష్ రాజ్ను సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అభివ్యక్తి స్వేచ్ఛ పేరుతో తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు, బండ్ల గణేష్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త రాజకీయ, సినీ వివాదానికి తెరలేపింది. ఈ వివాదం ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్, ఏపీ ప్రభుత్వం, యూట్యూబర్ రావణ్, బండ్ల గణేష్ ట్విట్టర్, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు, టాలీవుడ్ వివాదాలు