
ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకపడిన ప్రాంతం అయిన కుప్పం నియోజకవర్గం పారిశ్రామిక హక్కుగా రూపొందించడం జరుగుతుంది. గతంలో తీవ్రమైన కడుపుతో అల్లాడిన ఈ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరువు సీమ అయిన రాయలసీమలో ఇప్పటికే అనేక పెద్ద పెద్ద కంపెనీలను పెట్టేలా ఆహ్వానించిన చంద్రబాబు, కుప్పంలో కూడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకున్నారు.
కుప్పం నియోజకవర్గం లో పెట్టుబడులు పెట్టేందుకు 30 కంపెనీలు
గడిచిన రెండేళ్ల కాలంలోనే దాదాపు 30 కంపెనీలు కుప్పం నియోజకవర్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దాదాపు తొమ్మిది వేల 332 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబు నాయుడు రూ. 200 కోట్లతో ఏర్పాటు చేసిన ఏ బి ఐ ఎస్ పరిశ్రమను కలిగి ఉంది.

దాదాపు 40 వేల మందికి ఉద్యోగాలు
ఈ పరిశ్రమ ద్వారా 1400 మందికి పైగా స్థానికులకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. కంపెనీలు పెట్టుబడులు పెడుతున్న అనేక మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే శంకుస్థాపన చేసిన పరిశ్రమల ద్వారా దాదాపు 40 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
బెంగుళూరుకు సమీపంలో ఉన్న ప్రధాన అనుకూలత
గుడిపల్లె మండలం పొగురు పల్లెలో అడిడాస్ సంస్థకు బూట్లు సరఫరా చేసే హ్వాసెంగ్ యూనిట్ ద్వారా దాదాపు 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 2081 కోట్ల రూపాయలతో అధా గ్రూప్ బ్యాటరీ అనోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. కుప్పం భౌగోళికంగా బెంగుళూరుకు సమీపంలో ఉండటం కూడా ఇక్కడ పారిశ్రామిక ప్రగతికి ప్రధాన అనుకూలతగా మారింది.
1,200 ఎకరాల విస్తీర్ణంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం
రవాణా సౌకర్యాలను మరింత అందించడంలో భాగంగా కుప్పం – మారికుప్పం రైల్వేలైన్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. అంతేకాదు రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో సుమారు 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి తన తదుపరి పర్యటనలో ఈ ఎయిర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.కుప్పపోర్ట్ కోసం, సాగునీటి సమస్య తీరింది. ఇప్పుడు పారిశ్రామిక ప్రగతితో కూటమి ప్రభుత్వ హయాంలో కుప్పం శరవేగంగా దూసుకుపోతుంది.