

తేది 27/06/2025 శుక్రవారం
కిసాన్ మిత్ర ఆధ్వర్యంలో
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ లైవ్ స్టిక్ మిషన్ ( ఎన్.ఎల్.ఎం )ప్రాజెక్ట్ పై అవగాహనా సదస్సు
నెల్లూరు జిల్లా సైదాపురం మండలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేషనల్ లైవ్ స్టిక్ మిషన్ ప్రాజెక్ట్ పై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఎల్ ఎం ( నేషనల్ లైవ్ స్టిక్ట్ మిషన్ )స్కీమ్ ద్వారా 50% సబ్సిడీ వస్తుందని తెలిపారు . ఒక యూనిట్ వాల్యూ 20లక్షలు అని తెలియజేశారు. ఇoదులో గరిష్టం గా కోటి రూ రూపాయలు వరకు ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అర్హత అవసరం లేదని అన్నారు. అంటే కులం, మతం, చదువు, ఏమి అవసరం లేదని తెలిపారు. మరియు య స్ సి, యస్ టి,బీసీ, ఓ సి లు ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ కు అర్హులేనని తెలిపారు.
ఈ స్కీమ్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు Ch.పోలయ్య గారు,కిసాన్ మిత్ర జిల్లా మేనేజర్ B.వెంకటేశ్వర్లు, కిసాన్ మిత్రా ఫీల్డ్ ఆఫీసర్ M.రవికుమార్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు