VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్.

జూలై 9 వ తారీకు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.
పేద కార్మికులు పొట్ట కొట్టి కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగ్ నరసింహారావు. ,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు. . దేశంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న పార్టీ పేదలు దళితులు కార్మికులు కష్టజీవులు బడుగు బలహీన వర్గాల పట్ల వారి సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం నెక్కొచ్చుగా పోరాడుతున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సిపిఐ పార్టీని ఆదరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగ్ నరసింహారావు అన్నారు మహాసభ వేము రాంబాబు అధ్యక్షతన విజ్ఞాన్ స్కూల్లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలు అనేక పోరాటాలు నిర్వహించిందని కమ్యూనిస్టు పార్టీ త్యాగాల వెలుగులు దేశానికి సంపూర్ణ స్వతంత్రం కోసం నినదించి పోరాడిందని దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు ఉపాధి హామీ పథకాన్ని నెరవేరియం చేసి పేదల వ్యవసాయ కూలీల పొట్ట కొట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఇట్టి ప్రయత్నాన్ని వ్యవసాయ కార్మికులు పేదల అడ్డుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు అన్నారు ఉపాధి కూలీల సమస్యలపై అలుపెరగని పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రావి శివరామకృష్ణ మరో కార్యవర్గ సభ్యులు సత్తుపల్లి నియోజకవర్గం సెక్రటరీ దండు ఆదినారాయణ లు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ సిపిఐ అని ప్రజల సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు ముందుండి పోరాడుతుందని అందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు ఈ మహాసభలో వేము రాంబాబు దయాకర్ బాగా సత్యవతి నెంబర్ రామకృష్ణ యోబు పాలకుర్తి వీరయ్య రాజశేఖర్ యద్దనపూడి పిచ్చయ్య పొగడ్ల భద్రయ్య ఖమ్మంపాడు వెంకటలక్ష్మి కోల మాధవరావు ఉప్పర్ నాగమణి బాణావత్ రేణుక అలివేలు అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు