Home ఆంధ్రప్రదేశ్ రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి

రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి

by VRM Media
0 comments

Vrm Media

జైరామ్‌నగర్: ఛత్తీస్‌గఢ్‌ లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలును పాసింజర్ రైలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. అధికారులు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. KP

2,852 Views

You may also like

Leave a Comment