



ఖమ్మం నగరంలో ఈరోజు మంజు బ్యానర్పై, పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘మగువ’ అనే కొత్త టెలివిజన్ సీరియల్కు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ— మహిళా శక్తి, కుటుంబ విలువలు, సామాజిక అంశాలతో సాగనున్న ఈ సీరియల్ ప్రేక్షకుల హృదయాలను తట్టుకునేలా రూపొందిస్తున్నామని తెలిపారు.
సీరియల్ కథలో మహిళ ఓటమిని కాదు – ఆత్మవిశ్వాసాన్ని, ఎదుగుదలను, కుటుంబానికి అండగా నిలిచే శక్తిని చూపించబోతున్నామని చెప్పారు. ఖమ్మంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కళాకారులు, సాంకేతిక నిపుణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
‘మగువ’ సీరియల్ త్వరలో టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు రానుందని, కుటుంబ విలువలను ప్రతిబింబించేలా ప్రతి ఎపిసోడ్ను నాణ్యతతో తెరకెక్కిస్తున్నామని పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్ టీమ్ పేర్కొంది.