
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 6
అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు సిద్ధవటం మండల కేంద్రమైన తాసిల్దార్ కార్యాలయం లో సిద్దవరం టిడిపి నాయకులు మాట్లాడుతూ సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని పార్వతీపురానికి చెందిన చేనేత కార్మికులకు గడిచిన మౌంతా మరియు ద్విత్వ తుఫాను వర్షాల కారణంగా మగ్గం గుంతలో నీరు చేరి చేనేత కార్మికులకు చేనేత వేయడానికి ఇబ్బందిగా మారింది కావున రెండు నెలల కాలం నుండి పూట గడవడం కష్టంగా మారింది కావున మీరు స్పందించి చేనేతలకు ఇబ్బందులను గమనించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించడానికి సహకరించండి అని సిద్ధవటం మండల నాయకులు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కే రాజశేఖర్ యాదవ్, పార్లమెంటు కార్యదర్శి నాగముని రెడ్డి, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, అవ్వరు రాజారామ్, గంజి సుబ్బరాయుడు, భవనాసి పవన్ కుమార్ పాల్గొన్నారు