
అంతర్జాతీయ
-కొరివి జయకుమార్
అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, ఈ గురువారమే కీలక చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్యపరంగా సిద్ధం అవుతున్నాయి.
గత శనివారం ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య సుమారు 21 గంటల పాటు కీలక చర్చలు జరిగాయి. అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ భద్రత వంటి ప్రధాన అంశాలను తీవ్రంగా చర్చించారు, ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండా ముగిసింది. దీంతో చర్చలు విఫలమయ్యాయని ప్రకటించడంతో పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన Strait of Hormuz ప్రాంతంలో అమెరికా తన నౌకాదళాన్ని మోహరించినట్లు సమాచారం. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ జలసంధి చుట్టూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 21తో ముగియనుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టర్కీ, పాకిస్థాన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చి, ఇరు దేశాలు మళ్లీ చర్చల బాట పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కరెన్సీ విలువ పోవడం, ద్రవ్యోల్బణం పెరగడం, ప్రజల జీవన వ్యయం అధికమవడం వంటి సమస్యలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు, ఇరాన్ తన అణువణువూ కొనసాగుతుండటం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశమే ఇరు దేశాల మధ్య ప్రధాన విభేదాలకు కారణం.
గతంలో కూడా అమెరికా-ఇరాన్ మధ్య సుమారు 40 రోజుల పాటు యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, శాశ్వత శాంతి ఒప్పందం కుదరడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరు దేశాలు తమ డిమాండ్లపై కఠినంగా చర్చలను క్లిష్టతరం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, భద్రతపై ఈ ఉద్రిక్తతల ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే చర్చలు సానుకూలంగా ముగుస్తాయా? లేక మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయా? అన్నదానిపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఉన్నాయి.