
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడి షెడ్యూల్ ఖరారు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పది వాల్యుయేషన్ తుది దశకు చేరుకుంది. ఈ నెల 23వ తేదీతో మూల్యాంకనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తరువాత మార్కులు. అదే సమయంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఫలితాల విడుదలకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. ఫలితాల తేదీ పైన ఒక అంచనాకు వచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాల వెల్లడి దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికే పరీక్షా పత్రాల వాల్యుయేషన్ పూర్తి కాగా, తెలంగాణలో ఈ నెల 23తో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. ఏపీలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు మూల్యాంకనం కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ కొనసాగుతోంది. ముందుగా ఈ నెల చివరి వారంలోనే ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావించారు. కాగా, తాజాగా మే నెల మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వెల్లడి కావటంతో.. సాధ్యం అయిన త్వరగా ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు.

ఈ నెల 30 లేదా ఏప్రిల్ 2,3 తేదీల్లో ప్రకటన
కాగా, తెలంగాణలో మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13తో ముగిసింది. మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు రాశారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 23వ తేదీతో ఈ మూల్యాంకన ప్రక్రియ పూర్తికానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసి.. మార్కుల నమోదు ప్రక్రియకు మరో పదో రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, మే 4 లేదా 5వ తేదీల్లో పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని అధికారులు. చాలా త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నాము… ఫలితాల వెల్లడి సమయంలో విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమాచారం ఇచ్చే విధంగా పకడ్బందీగా కసరత్తు చేయడానికి సిద్ధంగా ఉంది. కాగా గత ఏడాది ఏప్రిల్ 30న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 30న లేదా మే మొదటి వారంలో ప్రకటించేందుకు కసరత్తు కొనసాగుతోంది.