
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీలో మరోసారి పెట్రోల్, డీజిల్ సంక్షోభం (ఇంధన సంక్షోభం) తలెత్తేలా ఉంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత కారణంగా వినియోగదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇంకొన్ని చోట్ల రెండు రోజులుగా చమురు కొరత ఉందని అంటున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు అంటున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, సరఫరా ఇబ్బందులు కారణమని ఇంకొందరు చెబుతున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఉండవల్లి సెంటర్ కీలక భాగాలను పెట్రోల్ బంకుల్లో ‘నో డీజిల్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, రైతులు బెంబేలెత్తిపోతున్నారు. బంకుల్లో నిల్వలు నిండుకోవడంతో ఉన్న కొద్దిపాటి స్టాక్ను కూడా సిబ్బంది రేషన్ పద్ధతిలో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులకు 1000 రూపాయలకు మించి డీజిల్ పోసేది లేదని బంకు సిబ్బంది తెగేసి చెబుతున్నారు.

ఉన్న చోట కూడా డీలా పరిమితి విధిస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి, వ్యవసాయానికి అవసరమైన రైతులకు గత్యంతరం లేకుండా’’ అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోరుతున్నారు.