
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టింది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో శుభ్రమైన వాతావరణం నెలకొనడం, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటోంది. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించింది.
పవన్ కల్యాణ్ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజలందరినీ చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ నిర్వహణను సులభతరం కూటమి ప్రభుత్వం అందించిన స్వచ్ఛరథల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రెటీ సహకారాన్ని తీసుకుంటున్నారు.

ఈ కోసం ప్రముఖ నటుడు నాని.. ముందుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛరథాలపై తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. జల సిరులు, పారిశుద్ధ్య వీరులు అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. తడిచెత్త, పొడిచెత్తను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. పారిశుద్ధ్యంపై గ్రామీణ స్థాయిల్లో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నాని అన్నారు. ఈ చెత్త నుంచి సంపదను సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ వీడియో విడుదల చేసిన నాకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్వచ్చరథలు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించామని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనమని పవన్ కల్యాణ్ సూచించారు. మరింత మంది సెలెబ్రెటీలు ముందుకు రావాలని.
#PawanKalyan TransformsAP #అధ్యాయం 2
మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజలందరినీ… pic.twitter.com/iFK07jEYHl
– డిప్యూటీ సీఎంఓ, ఆంధ్రప్రదేశ్ (@APDeputyCMO) మే 2, 2026
భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛత పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం ప్రారంభించామని గుర్తు చేశారు.