
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఒకప్పుడు వైసీపీ ఎంపీగా కేంద్రం వద్ద, ప్రధాని మోడీ వద్ద మంచి మార్కులు సంపాదించుకున్న విజయసాయిరెడ్డి (విజయసాయి రెడ్డి) ఆ తర్వాత రూటు మార్చి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కూడా బీజేపీపై, కేంద్రంపై తన మమకారం వదులుకోలేక వరుసగా ట్వీట్లు పెడుతూ వచ్చిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుబడుతూ సాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు.
కేంద్రం తాజాగా వాణిజ్య గ్యాస్ సిలెండర్ల (కమర్షియల్ LPG సైక్లిండర్) ధరను ఏకంగా రూ.933 పెంచింది. దీంతో ఇప్పుడు వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 3 వేలు దాటిపోయింది. దీని ప్రభావం అన్ని రెస్టారెంట్ల వ్యాపారంపై తీవ్రంగా పడుతోంది. ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదే అనుకుంటున్న విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹2,031 నుండి ₹3,024కు, అంటే ₹933 మేర పెరగడం భారతదేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షలకు పైగా రెస్టారెంట్లకు భారీ షాక్.

కమర్షియల్ LPG సిలిండర్ను ₹2,031 నుండి ₹3,024కి ₹933 పెంచడం భారతదేశం అంతటా 5 లక్షల+ రెస్టారెంట్లకు భారీ షాక్. వారి మార్జిన్లు అణిచివేయబడతాయి, ధరలు పెరుగుతాయి మరియు వేతన కోతలు మరియు ఉద్యోగ నష్టాల ద్వారా కార్మికులు భారాన్ని భరిస్తారు. ఈ వ్యయ స్పైరల్ రెండు వ్యాపారాలను దెబ్బతీస్తుంది…
— విజయసాయి రెడ్డి వి (@VSReddy_MP) మే 2, 2026
కేంద్రం తీసుకున్న గ్యాస్ ధర పెంపు నిర్ణయంతో రెస్టారెంట్ల లాభాలు పూర్తిగా దెబ్బతింటాయని, ధరలు పెరుగుతాయని, వేతన కోతలు, ఉద్యోగ నష్టాల రూపంలో కార్మికులు తీవ్ర భారాన్ని మోయాల్సి వస్తుందని సాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరల పెరుగుదల వ్యాపారాలను, వినియోగదారులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ ఇరాన్ యుద్ధం ఇప్పుడే ఆగాలని నిర్ణయించుకుంది. ఆ యుద్దం ఆపి ధరల్ని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని చెప్పకనే చెప్పారు.