VRM media అయినవిల్లి భద్రం
రాజానగరం నియోజకవర్గంలో రాబోయే పుష్కరాల ఏర్పాట్లు, ఘాట్ల అభివృద్ధి మరియు వేసవి కాలంలో నీటి సరఫరాపై రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గురువారం రాజానగరం కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా (RWS) శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఉన్నతాధికారుల అనుమతి కోసం కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మునికూడలి ఘాట్ను ‘మోడల్ పుష్కర్ ఘాట్’గా అభివృద్ధి:
👉 రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, మునికూడలి పుష్కర ఘాట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘మోడల్ పుష్కర్ ఘాట్’గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు.
పుష్కర ఘాట్లలో యాత్రికులకు మెరుగైన సదుపాయాలు:
👉 నియోజకవర్గంలో ప్రతిపాదించిన 13 పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు, యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా పుష్కర రేవుల వద్ద తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కడా పారిశుధ్య లోపం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఘాట్లలో తాగునీరు మరియు పారిశుధ్య సదుపాయాల కొరకు రూ. 4.52 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
రూ. 129 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 1,535 సిసి (CC) డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.
రూ. 7 కోట్లతో ‘హై ఇంపాక్ట్’ పథకం (High-Impact Projects) కింద వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలు.
వేసవి నీటి ఎద్దడి నివారణ చర్యలు:
👉 రాబోయే వేసవి కాలంలో నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే RWS అధికారులను ఆదేశించారు. వెలుగుబంద, పరిజెల్లపేట, ఈస్ట్ గోనగూడెం, గాదరాడ వినాయకుని ఆలయం సెంటర్లలో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
