Home ఎంటర్‌టెయిన్మెంట్ సుకుమార్, దేవిశ్రీ కాంబోకి బ్రేక్ పడితేనా.? – VRM MEDIA

సుకుమార్, దేవిశ్రీ కాంబోకి బ్రేక్ పడితేనా.? – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లలో లెక్కల మాస్టర్ సుకుమార్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ జోడీ ఖచ్చితంగా ఉంటుంది. సుకుమార్ సినీ ప్రయాణం మొదలైన మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి నిన్నమొన్నటి ప్యాన్ ఇండియా సంచలనం ‘పుష్ప’, ‘పుష్ప 2’ వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న అద్భుతమైన ట్యూన్స్, సుకుమార్ రాసుకునే విజువల్స్ వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఎన్నో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందించారు. అయితే, ఇటీవల కాలంలో మెగా హీరోలు దేవిశ్రీ ప్రసాద్‌ను పక్కన పెడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన 4 సినిమాలలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అయినప్పటికీ, చిరంజీవి తన తదుపరి చిత్రాలకు దేవిశ్రీని కాదని వేరే దర్శకులను ఎంపిక చేసుకోవడం, అలాగే బుచ్చిబాబు కూడా తన సినిమా ‘ఉప్పెన’కు దేవిశ్రీతో అద్భుతమైన మ్యూజిక్ ఇప్పించుకుని, తన రెండో సినిమా ‘పెద్ది’ కి వచ్చేసరికి ఏఆర్ రెహమాన్‌ను సంగీతానికి తెచ్చాడు. ఈ నేపథ్యంలో, సుకుమార్-రామ్ చరణ్ కలయికలో రాబోయే ‘RC 17’ చిత్రం కూడా దేవిశ్రీ ప్రసాద్మయ్యాడనే రూమర్స్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపించాయి.

ఈ రూమర్స్ రావడానికి ప్రధాన కారణం ‘పుష్ప 2’ సినిమా మేకింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు. ‘పుష్ప 2’ ఆల్బమ్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన టైటిల్ సాంగ్, కిస్సిక్, జాతర సాంగ్స్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఊపేశాయి. సినిమా మ్యూజికల్ హిట్ చేయడంలో దేవిశ్రీ తన వంతు పాత్రను వంద శాతం పోషించాడు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్, దేవిశ్రీ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయనే ప్రచారం జరిగింది. దీని కారణంగానే సుకుమార్ ‘పుష్ప 2’ లోని కొన్ని కీలకమైన సన్నివేశాల రీ-రికార్డింగ్ బాధ్యతలను తమన్‌కు అప్పగించాల్సి వచ్చింది. ఈ ఒక్క సంఘటనతో దేవిశ్రీ, సుకుమార్ ఎపిక్ కాంబోకి బ్రేక్ పడిందని, రామ్ చరణ్ సినిమాలో దేవిశ్రీ ఉంటే కష్టమేనని అందరూ భావించారు.

కానీ, సుకుమార్ లాంటి క్రియేటివ్‌కు మ్యూజిక్ విషయంలో తన బలం ఏంటో బాగా తెలుసు. ఒకటి రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినంత మాత్రాన, తన కెరీర్‌కు ఎన్నో మ్యూజికల్ వెపన్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ లాంటి క్లోజ్ ఫ్రెండ్, టాలెంటెడ్ కంపోజర్‌ను పక్కన పెట్టేంత సాహసం సుకుమార్ చేయరని స్పష్టమవుతోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా, అందులోని ప్రతి పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ (RC 17) కోసం దేవిశ్రీ ప్రసాద్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా లాక్ చేసినట్లు తాజా సమాచారం.

ప్రస్తుతం ‘RC 17’ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఒక పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి అతనికి మరో 4 నుండి 5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ‘పుష్ప 2’ ను మించిన భారీ కథను సిద్ధం చేసే పనిలో లెక్కల మాస్టర్ టీం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ అధికారికంగా ఖరారు కావడంతో మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం.

సుకుమార్ రామ్ చరణ్ మూవీ, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, RC 17 లేటెస్ట్ అప్‌డేట్స్, పుష్ప 2 BGM ఇష్యూ, సుకుమార్ DSP కాంబో బ్రేక్, రామ్ చరణ్ సుకుమార్ మూవీ 2027

2,802 Views

You may also like

Leave a Comment