
తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఆలేరు స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో S5 బోగీలో మంటలు చెలరేగాయి. మొదట దట్టమైన పొగ వెలువడింది. ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో బోగీ మొత్తం కూడా వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు.
ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు బోగీ నుంచి కిందికి దూకారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని ప్రాథమికంగా అందిన ప్రకారం చూపిస్తుంది. కాగా ఈ అగ్నిప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మంటలు చెలరేగిన కారణాలపై విచారణ కొనసాగుతోంది. షార్ట్ లేదా సాంకేతిక లోపం కారణమని.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైల్వే రెస్క్యూ టీం, ఇతర సహాయకుల పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోగీ నుంచి పొగ, మంటలు వెలువడటాన్ని ఇందులో స్పష్టంగా చూడొచ్చు. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, కోచ్ అంతా పొగతో నిండిపోయిందంటూ ఓ ప్రయాణికుడు చెప్పడం రికార్డయింది. రైలు పూర్తిగా ఆగేలోపే చాలా మంది దూకేశారని వివరించారు.