
అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
ఇరాన్ తో చర్చలు విఫలమైన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) వార్ మోడ్లోకి వెళ్లింది. ఇరాన్ పోర్టులను దిగ్బంధించనుంది. ఇప్పటికే ఇది అమలులోకి వచ్చింది. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలు, అరేబియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్లోని సముద్ర మార్గాలను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలపై దిగ్బంధం కొనసాగుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్ వాణిజ్య జీవనరేఖను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఈ దిగ్బంధనం వల్ల ప్రతిరోజూ 435 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.4,000 కోట్లకు పైమాటే. ఇటువంటి ఆర్థిక నష్టం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ది వాల్ స్ట్రీట్ జర్నల్. ప్రతిపాదన ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఒప్పందం ట్రంప్ తాజాగా స్పందించారు. ఇరాన్ తో యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకుందని ప్రకటించారు. ఇస్లామాబాద్లో జరిగిన తొలి విడత చర్చలు స్తంభించిన తర్వాత రెండో దఫా కూడా అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఈ యుద్ధం దాదాపు ముగిసిందని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముగింపునకు అతి సమీపంలో ఉన్నామని. వ్యూహాత్మకంగా అత్యంత పటిష్టంగా ఉన్నామని, ఈ స్థితిలో ఇరాన్ కు మరో గత్యంతరం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు తాను అన్నింటిని ఉపసంహరించుకుని, యుద్ధానికి పుల్ స్టాప్ పెట్టినా కూడా పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ కు 20 సంవత్సరాలు పడుతుందని అన్నారు. తమ పని ఇంకా పూర్తి కాలేదని, మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు.
తమతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ అన్నారు. ఇరాన్తో తదుపరి చర్చలు జరిగే అవకాశాలు లేకపోలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. యుద్ధం ప్రారంభం కాకముందు నుంచీ దౌత్య చర్చలకు నాయకత్వం వహించిన ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్.. మలి విడత సమావేశాలకు ప్రాతినిథ్యం వహించే సీఎన్ఎన్. చర్చల ట్రంప్ బాధ్యత తన ముగ్గురు సీనియర్ సలహాదారులకు అప్పగించారని.