Home ఎంటర్‌టెయిన్మెంట్ ఓటీటీలోకి ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. మాయమైన ఆ టీవీ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? – VRM MEDIA

ఓటీటీలోకి ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. మాయమైన ఆ టీవీ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


టెక్నాలజీ లేని రోజుల్లో ఒక ఊరికి టీవీ రావడం అంటే అదొక పెద్ద పండుగ. అలాంటి ఒక ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని, దానికి సస్పెన్స్ ఎలిమెంట్ జోడించి ప్రదర్శించిన సినిమానే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (తిమ్మరాజుపల్లి టీవీ). కిరణ్ అబ్బవరం సమర్పణలో, వి. మునిరాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ థియేటర్లలో మంచి స్పందన లభించింది, ఇప్పుడు ‘ఆహా’ వేదికగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

కథా నేపథ్యం:
ఈ కథ 1996వ సంవత్సరంలో తిమ్మరాజుపల్లి అనే మారుమూల గ్రామంలో సాగుతుంది. గ్రామస్తులంతా తలా కొంత డబ్బు వేసుకొని టీవీ కొనుక్కుంటారు. ఊరంతా కలిసి ఒకే చోట టీవీ చూడటం, వినోదాన్ని పంచుకోవడం ఒక ఎమోషన్. అయితే, అనూహ్యంగా ఆ టీవీ మాయమవుతుంది. ఆ దొంగతనం నింద ఒక వ్యక్తిపై పడుతుంది. అసలు టీవీని దొంగిలించింది ఎవరు? ఆ టీవీ వెనుక ఉన్న రహస్యాలేంటి? ఆ పల్లెటూరి అమాయకత్వంలో దాగి ఉన్న నిజం బయటపడిందా? అన్నదే ఈ సినిమా ప్రధానాంశం.

సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దర్శకుడు మునిరాజు పల్లెటూరి యాసను, అక్కడి మనుషుల మధ్య ఉండే సంబంధాలను చాలా సహజంగా తెరకెక్కించారు. 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, సెకండ్ హాఫ్‌లో వచ్చే సస్పెన్స్, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

పల్లెటూరి కథలు, నోస్టాల్జియా, మిస్టరీ ఇష్టపడే వారికి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఒక మంచి ఛాయిస్. ఈ సినిమా మే 15 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్‌లు 24 గంటల ముందే ఈ వీక్షించే అవకాశం ఉంది. మరి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

2,801 Views

You may also like

Leave a Comment