Home Uncategorized జన బాంధవుడు ఎన్టీఆర్

జన బాంధవుడు ఎన్టీఆర్

by VRM Media
0 comments

అరాచక పాలన స్వస్తి

టిడిపి కార్యకర్తలే పార్టీకి బలం

టిడిపి ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు

జన బాంధవుడు ఎన్టీఆర్

అరాచక పాలన స్వస్తి

టిడిపి కార్యకర్తలే పార్టీకి బలం

టిడిపి ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు

సిద్ధవటం. VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ , మే28

తారక్ రాముని జన్మదినం వేడుకలు మనకు పర్వదినమని టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు సిద్ధవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ ఫంక్షన్ హాలులో గురువారం మహానాడు 2 వ రోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ మహా మనిషి కోట్లాదిమంది గుండెల్లో దైవమై కొలువైన మహానటుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి జన బాంధవుడు ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు, అమలు చేశారని, అరాచక పాలన తరిమికొట్టి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి అమలైపోయాయని,, ఐదేళ్ల గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి కార్యకర్తలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు బనాయించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన టిడిపి కార్యకర్తలు ఎవరు కూడా భయపడకుండా గొడ్డలి పార్టీని, తరిమి కొట్టారని పేర్కొన్నారు టిడిపి కార్యకర్తలపై రాబోయే స్థానిక ఎలక్షన్లో ఎవరైనా దౌర్జన్యం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి టిడిపి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్ రాజా నాయుడు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మోహన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంజీవ రాయుడు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు చలమయ్య, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి మండల ఉపాధ్యక్షులు, రామచంద్రయ్య సింగిల్ విండో డైరెక్టర్లు, బాలిరెడ్డి, సాంబశివారెడ్డి, టిడిపి మండల మాజీ కన్వీనర్ మామిడి సుబ్బారెడ్డి రాజంపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు చెంచయ్య నాయుడు, రైతు విభాగపు కార్యదర్శి మల్లు వెంకట సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు నాగభూషణం, టిడిపి సీనియర్ నేతలు, పుత్త బాబు సామ శ్రీనివాసులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణయ్య, మహిళలు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు తదితర కార్యకర్తలు మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు

2,802 Views

You may also like

Leave a Comment