VRM మీడియా అయినవిల్లి భద్రం అనుశ్రీ సినిమాస్ (సాయికృష్ణ) థియేటర్లో ప్రముఖ సినీ నటుడు ” మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” నటించిన పాన్ ఇండియా చిత్రం “పెద్ది” ప్రీమియర్ షోను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ,జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ అను శ్రీ సత్యనారాయణ ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ శ్రీమతి గంటా స్వరూప దేవి వీక్షించారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన “పెద్ది” చిత్రాన్ని అభిమానులతో కలిసి వీక్షించిన జనసేన పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ అను శ్రీ సత్యనారాయణ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు జనసేన నాయకులు జనసేన వీర మహిళలు జనసేన అభిమానులు పాల్గొన్నారు.