
తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరో తీపికబురు అందించింది. గత కొన్నిరోజులుగా వరుస నోటిఫికేషన్లతో జోరు పెంచిన కమీషన్.. కేవలం నాలుగురోజుల వ్యవధిలోనే మరో కీలక ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు 290 ఇంజనీర్ ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది.
మొత్తం 24 ఉన్నత స్థాయి పోస్టుల భర్తీ
తాజాగా పాఠశాల విద్యాశాఖ ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Dy. EO), గెజిటెడ్ హెడ్మాస్టర్ – 1 పోస్టుల భర్తీకి ఈ తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యాశాఖలో మొత్తం 24 ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు మరియు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి.

రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు
గతంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూల నిర్వహణపై విద్యాశాఖకు, టీజీపీఎస్సీకి మధ్య కొంత సందిగ్ధత నెలకొనడంతో నోటిఫికేషన్ ఆలస్యమైంది. అయితే, పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఇంటర్వ్యూల రద్దు చేయడంతో, కేవలం రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండటం.
టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అన్ని వివరాలు
వయోపరిమితిని జులై 1, 2026 నాటిని ప్రామాణికంగా తీసుకుంటారని కమిషన్ స్పష్టం చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు పూర్తి విద్యా అర్హతలు, సిలబస్, పరీక్షా విధానం, దరఖాస్తు మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ వంటి సమగ్ర వివరాలను అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చూసుకో కమీషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పంపబడింది. విద్యాశాఖలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇదొక అద్భుతమైన అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.