

‘బేబీ’ మూవీతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య(వైష్ణవి చైతన్య).మొదటి సినిమాతోనే అద్భుతమైన పెర్ఫార్మ్ కనబరిచి, యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. ప్రేక్షకులు బేబీ ఇమేజ్ తోనే వైష్ణవిని చూస్తున్నారా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఈ అప్ నేపథ్యంలో కమింగ్ మూవీ ‘ఎపిక్’ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఆనంద్ దేవరకొండ(Anandh deverakonda)హీరో కాగా 90’s ఫేమ్ ఆదిత్య హాసన్(Aditya haasan)దర్శకుడు. రీసెంట్ గా ఎపిక్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైష్ణవి ఒక ప్రశ్న ఎదురు కావడంతో తడబాటుకి గురైంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
ఒక విలేకరి వైష్ణవితో బేబీ తర్వాత ఇమేజ్ చేంజ్ ఓవర్ అవసరమైంది కదా.. అది ఎపిక్ అనుకోవచ్చా అని అడిగాడు. దీనితో ఏం చెప్పాలో తెలియక వైష్ణవి ఇబ్బంది పడడంతో పాటు సమాధానం చెప్పలేకపోయింది. ఆదిత్య హాసన్ వెంటనే ఎవరి కోణంలో మార్చని అడిగాడు. ఆనంద్ కూడా మాట్లాడుతూ కెరీర్ అంతా ఒకే ఇమేజ్ ని కొనసాగించాలి. మూవీలోని క్యారక్టర్ ని బట్టి కూడా ఉంటుంది. ఎపిక్ లో చాలా బలమైన ఫిమెల్ రోల్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Pooja hegde: పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూజాహెగ్డే!..పెళ్లి కొడుకు ఈ హీరోనే!
