
భారతదేశం
-బొమ్మ శివకుమార్
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మహారాష్ట్రకు చెందిన ధనంజయ్ లోఖండా, మనీషా వాఘ్మారే (పుణె)లను అరెస్టు చేసింది. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. గత 24 గంటల్లో, దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించారు. మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై విద్యా మంత్రిత్వ శాఖ ఫిర్యాదుతో మే 12న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో భారతీయ న్యాయ సంహిత నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం, దొంగతనం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలు నమోదయ్యాయి.
అవినీతి నిరోధక చట్టం.. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాలను నిరోధించే) చట్టం 2024 కింద కూడా నేరాలు నమోదయ్యాయి. అరెస్టైన ఏడుగురిలో జైపూర్ నుండి ముగ్గురు, గురుగ్రామ్, నాసిక్ నుండి ఒక్కొక్కరు, పుణె, అహల్యానగర్ నుండి ఇద్దరు ఉన్నారు. కొంతమంది అనుమానితులు ప్రస్తుతం విచారణలో ఉన్నారు. దర్యాప్తు సంస్థ పలు ప్రదేశాల్లో తనిఖీలు, మొబైల్ ఫోన్లతో సహా కీలక ఆధారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్ స్పెషల్ గ్రూప్స్ (SOG)తో సమన్వయం చేసుకుంటూ, సీబీఐ సాంకేతికత, ఫోరెన్సి విశ్లేషణల ద్వారా అన్ని ఆధారాలను ఆపరేషన్ నియంత్రిస్తోంది.
లీకేజీ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం మంగళవారం మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది. తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో విడుదల చేస్తామని. కేంద్ర ఏజెన్సీల సమాచారం, చట్ట అమలు సంస్థల నివేదికల ఆధారంగా పరీక్ష సమగ్రతపై ఆందోళనలు లేవనెత్తబడటంతో ఎన్టీఏ (NTA) ఈ నిర్ణయం తీసుకున్నట్లు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఇ) ‘వ్యవస్థాగత వైఫల్యం’ పై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరీక్ష తిరిగి నిర్వహించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళన చేసి కొందరు బారికేడ్లను ఎక్కారు.