VRM మీడియా అయినవిల్లి భద్రం
పోలవరం జిల్లా అడ్డతీగల మండలం బొడ్లంక గ్రామంలో ఉపాధి హామీ పథకం స్థానంలో విబిజి రామ్ జి పథకాన్ని ఏపీవో బి చిరంజీవి రావు తెలియజేశారు, ఉపాధి శ్రామికులకు 100 వంద రోజులు ఉన్నటువంటి పని దినాలను 125 రోజులకు పెంచడం మరియు ఉపాధి వేతనాన్ని 307 ఉన్నటువంటి ఉపాధి వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం జరిగిందని తెలియజేయడం జరిగింది, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది, ఈ పథకాన్ని కూటమి నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జర్త.వెంకటరమణ రెడ్డి జనసేన పార్టీ వీర మహిళ పాతర సీతామహాలక్ష్మి ఏపీవో బి చిరంజీవి రావు టెక్నికల్ ఆఫీసర్ లక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ రాములు , గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది..

