సిద్ధవటం,VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 3
జనసేన పార్టీ సారధుల సేకరణ పార్లమెంటు, నియోజకవర్గాల వారీగా అత్యంత కోలాహారంగా కొనసాగుతుందని జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణ పేర్కొన్నారు మండల కేంద్రమైన సిద్ధవటం, దిగు వపేట ఆకుల వీధి గ్రామంలో తన నివాసంలో తన నివాసంలో శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటు, నియోజకవర్గాల మండల స్థాయిలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి పదవులను కట్టబెట్టేందుకు వారి సమాచార సేకరణ తీసుకునేందుకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం జూలై 5 వరకు గడువు పెంచిందని జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరు మీ సమాచారాన్ని రాజంపేట లోని జనసేన పార్టీ కార్యాలయంలో సమర్పించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు నుండి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తించి పార్టీలో సమితి న్యాయం జరుగుతుందని తెలిపారు
