*VRM మీడియా అయినవిల్లి భద్రం నర్సాపురం గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రత వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని రొంగలి శ్రీను గృహంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
