𝘝𝘙𝘔 న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట
తెలుగుదేశం పార్టీ 27 28 తేదీలలో ఒంటిమిట్ట హరిత కళ్యాణమండపంలో నిర్వహించనున్న మహానాడు ను విజయవంతం చేయాలని తెలుగుదేశం నాయకులు కార్యకర్త కు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు కార్యక్రమం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కొనసాగుతుంది అన్నారు తెలుగుదేశం పార్టీ పెన్షన్ పెంపు. తల్లికి వందనం మహిళా కు ఫ్రీ బస్సు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పార్టీ సిద్ధాంతాలు భవిష్యత్ కార్యాచరణ ప్రజా సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే వేదిక మహానాడు అని పేర్కొన్నారు ఈ మహానాడు ఉపయోగం పడుతుందని తెలిపారు మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు
రావాలని కోరారు పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో మరింత పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు మహానాడు ద్వారా కార్యకర్తలకు ఉత్సాహం పూర్తిగా లభిస్తుందని ఆయన తెలియజేశారు పార్టీ అభివృద్ధిలో కార్యకర్తల పాత్ర కీలకమని ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజంపేట నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చెమ్మతి జగన్మోహన్రాజు ఆధ్వర్యంలో చేపట్టు తున్న కార్యక్రమాలు సాగునీరు తాగునీరు రహదారులు సంక్షేమ పథకాల అమలు ప్రజా సమస్యల పై సమావేశంలో చర్చించ అన్నారు మహానాడుకు హాజరయ్యే నాయకులు కార్యకర్తల కోసం భోజనం త్రాగునీరు రవాణా విశ్రాంతి తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేలా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు ప్రతి కార్యకర్త తన బాధ్యతగా భావించి మహానాడు విజయవంతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు
