సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 24
అభివృద్ధి సంక్షేమం కూటమికే సాధ్యం
సిద్ధవటం
సంక్షేమం అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి తెలిపారు మండలంలోని ఖాజీ పల్లె గ్రామంలో కొన్నేళ్లగా గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దాన సంవత్సరాలకు వెళ్లేందుకు రహదారి లేక అవస్థలు పడేవారు గతంలో రహదారి పనులు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు అధికారులకు ప్రజాప్రతినిధులకు అర్జీలు పెట్టుకున్న సమస్య పరిష్కారం కాలేదు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు చొరవతో పంట పొలాల్లో నుండి పెన్నా నదికి స్మశాన రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లగా స్మశానానికి వెళ్లేందుకు రహదారి లేక ప్రజలు అవస్థలు పడేవారిని ఓ రైతు ముందుకొచ్చి రహదారి ఏర్పాటుకు తన పొలం ఇచ్చాడని గ్రామపంచాయతీలో తీర్మానం చేసి గ్రామ ప్రజల సహకారంతో స్మశాన రహదారి నిర్మాణం పనులు చేపడుతున్నామని సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి సాధ్యమని నియోజకవర్గ ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్రాజు సహకారంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత నిమ్మకాయల జగన్ రెడ్డి టిడిపి సీనియర్ నేత బాలకృష్ణారెడ్డి రైతులు పాల్గొన్నారు

