తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం కూనవరం గ్రామంలోని శ్రీ కునాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆయనకు బ్యాండ్ మేళా వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.
ఆలయంలో అమ్మవారి దర్శించుకుని, పూజలు నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, భక్తులకు వడ్డించారు.
నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట, కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 1,50,000 రూపాయలు విరాళం అందించారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.